ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను ప్రకటించడంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు కవిత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కవితను గెలిపించుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో 532 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవే. మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి కూడా ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్కు 140, బీజేపీకి 85 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కవిత గెలుపు ఖాయమని మంత్రి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి: చంద్రబాబు