telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ లేడికి ఆరుగురు ఎస్‌ఐలు బలి…

ARREST crime

ఓ లేడీ ఏకంగా పోలీసులను టార్గెట్ చేసింది… ఏదో విషయంలో పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కి.. అధికారులతో పరిచయం పెంచుకుంటుంది.. చనువుగా ఉంటుంది.. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ.. డబ్బులు వసూలు చేస్తుంది. ఇవాళ ఆ కిలాడీ లేడి లతారెడ్డిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు.. గత కొద్ది రోజులుగా పోలీసులను టార్గెట్ చేసిన లతా రెడ్డి.. ఇప్పటి వరకు ఆరుగురు ఎస్‌ఐలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఏదో ఒక విషయంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో పరిచయం పెంచుకునే లతారెడ్డి.. ఆ తరువాత చనువుగా ఉంటూ ఎస్సైలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది.. నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఇప్పటికే ఆరుగురు ఎస్సై లను బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. అయితే, లతారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ముందుకు రావడం లేదు.. కానీ, ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ కేసులో లతారెడ్డిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం పోలీసులు.. రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related posts