*జూబ్లీహీల్స్ బాలిక రేప్ కేసులో కీలక విచారణ..
*బాలికపై కొరకడం, రక్కడం తో గాయాలు..
*టాటులా ఉండాలనే మెడపై కొరికినట్టు నిందితులు వాగ్మూలం..
*బాలిక ప్రతిఘంటిడంతో గాయాలైనట్లు ఒప్పుకున్న నిందితులు..
* ఇవాళ ఐదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ విచారించనున్న పోలీసులు..
*జూబ్లీహీల్స్ రేప్కేసులో బాలిక మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది..
రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను జూబ్లిహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. ఈ మెడికల్ రిపోర్టు ఆధారంగా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
లైంగిక దాడి సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం, రక్కడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అయిదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్ను విచారించనున్నారు. పోలీసులు శనివారం నిందితులందరికి ఉస్మానియాలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్ హోంకు, సాదుద్దీన్ మాలిక్ను జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు.
పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయి: రేవంత్ రెడ్డి