శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల దోపిడీకి సహకరించి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
విద్యుత్ కేంద్రంలో జరిగింది.. ప్రమాదం కాదేమోనని, కుట్రని అనుమానంగా ఉందని అన్నారు. ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఆరు టన్నెళ్లలో నాలుగు పేలిపోయాయిన విషయం తెలిసిందే.