telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. నారా లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh

గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసం చేసినంత మాత్రాన ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదని, ప్రజల హృదయాల్లో కొలువైన దైవం అని పేర్కొన్నారు. నందమూరి తారకరామారావు విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ఆలోచించే జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని ట్విటర్ లో విమర్శించారు.

Related posts