ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశానికే వినిపించాలని ఉద్దేశ్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ధర్మదీక్ష జరగగా, నేడు కూడా నిరసనలలో భాగంగా పాదయాత్రకు పూనుకున్నారు. ఈ యాత్ర ఉదయం 11గంటలకు ప్రారంభించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఈ పాదయాత్ర జరిగింది.
ఈ పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్ పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ సెక్రటేరియేట్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మురళీకృష్ణ పాల్గొన్నారు. వీరితో పాటు ఆంధ్రా మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సినీ నటుడు శివాజీ చంద్రబాబుతో పాటు నడుస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించినట్టే జరిగింది.
video source : etv
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా