telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రగతిభవన్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

హైద్రాబాద్ ప్రగతిభవన్‌ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ప్రగతిభవన్ రక్షణ సిబ్బంది నజీరుద్దీన్‌ను అడ్డుకున్నారు. అనంతరం నజీరుద్దీన్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలోని చంచల్‌గూడకు చెందిన నజీరుద్దీన్‌ అనే వ్యక్తి నష్టాలతో చెప్పులషాపు నడుపుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా మరింత నష్టాల్లోకి అతను కూరుకుపోయినట్లు సమాచారం.

అప్పుల బాధతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది..తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాని నజీరుద్దీన్ చెబుతున్నాడు. అప్పులు తీర్చే దారిలేకే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు అతను చెబుతున్నాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. అయితే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రులతో సమీక్ష జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్నాయత్నం ఘటన జరగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

Related posts