ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం నేడు కొలువుదీరింది. ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, , చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఏపీ ప్రభుత్వం కొత్త మంత్రులకు ఇన్నోవా కార్లను కేటాయించింది. ఈ 25 మంది మంత్రులకు జగన్ ఏయే బాధ్యతలు అప్పగించబోతున్నారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సాయంత్రం నాటికి సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెులిపాయి.
కొన్ని చానళ్లు అమ్ముడు పోయాయి: జగన్