జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ… కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసినందుకు భారతీయ జనతాపార్టీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు.ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రత్యేక శ్రద్ధ చూపిన నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రజలు మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటారు. ఫ్లై ఓవర్ కు ఇరువైపులా మట్టి పనులు చేయడానికి 16 నెలల సమయం తీసుకున్న వైసీపీ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలంటే 16 సంవత్సరాల సమయం పడుతుంది. విజయవాడ రాజధాని నగరం రాజదాని అయినందుకే కనకదుర్గ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కల సాకారమైంది. విజయవాడను రాజధానిగా వద్దంటున్న వైయస్సార్సీపి ప్రజాప్రతినిధులు ఈ ప్రారంభోత్సవానికి అనర్హులు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పావలా పని చేసి రూపాయి పావలా ప్రచారం చేసుకుంటున్నారు ప్రచార ఆర్భాటాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తగ్గించుకోవాలి అని సుంచించారు.
previous post
నమ్మించి నట్టేట ముంచడం జగన్ నైజం: వంగవీటి రాధా