telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఇక్కడ నాయకులు ఇస్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు…

బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అధ్యక్ష పదవి నుండి తొలగించమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్ చేసాడు అని వైరల్ అవుతుంది. కానీ అది అవాస్తవం అని రాజా సింగ్ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపారు. అయితే  బండి సంజయ్ నన్ను మోసం చేసిన మాట వాస్తవం అని అన్నారు.  నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే జీహెచ్‌ఎంసీ ఎన్నికలో టికెట్ ఇవ్వాలని అడిగాను. మిగిత 150 డివిజన్ లలో ఎక్కడ అడగను అని చెప్పాను. కానీ ఇక్కడ నాయకులు ఇస్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. అందువల్ల నన్ను గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయినా… ప్రస్తుతం నా ఫ్యామిలీలో ఒకరు సూసైడ్ చేసుకుంటే ఆ చావులో ఉన్న.. 3, 4 రోజుల్లో అన్ని విషయాలతో కేంద్ర పార్టీ కి లేఖ రాస్తాను అని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు.

రాజా సింగ్ మేనల్లుడు రోహిత్ సింగ్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రోహిత్ తండ్రి పేరు మనీష్ సింగ్. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు రోహిత్ అంత్యక్రియలు మంగల్హాట్ నివాసం నుండి శ్మశానం వరకు అంతిమయాత్ర సాగనుందని బిజెపి గోషామహల్ ఇన్చార్జి కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మాత్రం తెలియదు.

Related posts