telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతాం..

Bandi sanjay bjp

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీ ముమ్మాటికీ హిందువుల పార్టీ అని…హిందూ ధర్మానికి అడ్డం వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ ఓ నియంత అని ఫైర్‌ అయ్యారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకుల బ్యాక్సులు బద్దలు కొడతామంటూ హెచ్చరించారు. తెలంగాణలో బియ్యం, డబుల్‌ బెడ్రూం, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్రానివేనన్నారు. అన్నీ కేంద్రం ఇస్తే కేసీఆర్‌ ఏమీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్‌లు మునగలేదు కాబట్టే..వరదల సమయంలో కేసీఆర్‌ బయటకు రాలేదని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్‌ ను బొంద పెడతామని, హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్తామని సంజయ్‌ హెచ్చరించారు. పేదలకు కష్టమొచ్చినప్పుడు పరామర్శించకపోవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని, రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ కేంద్రం నిధులు ఉన్నాయని తెలిపారు.

Related posts