telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భైంసా దాడి పై డీజీపీ స్పందన…

బైంసా లో మైనర్ బాలిక పై జరిగిన లైంగిక దాడి కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి విషయం పై డీజీపీ స్పందించారు. ఈ సంఘటన మీద పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని గుర్తించి కోర్టులో ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పరంగా గుర్తించి, నిందితుడికి  తగు శిక్ష పడే విధంగా దర్యాప్తు ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మహిళా భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీపీ దర్యాప్తును నిస్పాక్షికంగా, త్వరిత గతిన పూర్తి చేసి, నిందితుడికి  శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. బాధిత బాలికకు  వైద్య సహాయం అందించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు తగు ఆర్థిక  సహాయాన్ని సంబంధిత ప్రభుత్వ  శాఖలతో సమన్వయంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. చూడాలి మరి ఈ కేసులో నిందితులకు ఎప్పటివరకు శిక్షలు పడుతాయి అనేది.

Related posts