ముంబై ఇండియన్స్ టీమ్ ప్రస్తుతం చెన్నైలో ఉంది. ముంబై జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్లోనే భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కూడా ఉండటంతో తొలుత ముంబై యాజమాన్యం ఆందోళన చెందింది. అయితే కరోనా పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. కిరణ్ ముంబై జట్టు వికెట్ కీపింగ్ సలహాదారుగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటుంది. బీసీసీఐ రూపొందించిన ఆంక్షలు, నిబంధనలను తాము అత్యంత కఠినంగా అమలు చేస్తున్నామని ముంబై ఇండియన్స్ వెల్లడించింది. కొద్ది గంటల క్రితం ముంబై జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ మంగళవారం ట్రైనింగ్ సెషన్ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది. మోరేకు ఎలాంటి లక్షణాలు లేవని, అతడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడని చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. .
previous post
next post