telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌నగర్‌ ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టు: తలసాని

talasani srinivasayadav on clp merger

 హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు విపక్ష నాయకులకు చెంపపెట్టని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ప్రజల్లో పరపతిని సాధించి సత్తా చాటేందుకు విపక్షాలు ప్రయత్నం చేయాలని చురకాలంటించారు.

ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా పెట్రేగిపోయి మేమే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమంటూరెచ్చిపోయిన బీజేపీకి కనీసం ఓ వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముందు విపక్షాలు ప్రజల్లో పార్టీని బలపర్చుకుని అప్పుడు మాట్లాడాలని తలసాని హితవు పలికారు.

Related posts