*పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబుకు తప్పిన పడవ ప్రమాదం..
*పంటుపై నుంచి గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలు
దేవినేని ఉమ, ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, సత్యనారాయణ
*టీడీపీ నేతలను ఒడ్డుకు చేర్చిన స్థానికులు
పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈరోజు సాయంత్రం రాజోలులంక చేరుకున్న క్రమంలో పడవ ప్రమాదం జరిగింది.
చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటులో నుంచి దిగి రాజోలు లంక వెళ్లేందుకు మరపడవలోకి మారాల్సి వచ్చింది. మర పడవలో చంద్రబాబు వెళ్తుండగా.. ఆయనతో పాటు మరో పడవలో టీడీపీ నేతలు వెళ్లేందుకు అందరూ ఒక్కసారిగా పంటు చివరకు రావడంతో అదుపుతప్పి మరో బోటును ఢీకొంది.
ఈ ఘటనలో టీడీపీ నేతలు మాజీ మంత్రులు దేవినేని ఉమా, పీతల సుజాత, పితాని సత్యనారాయణ, ఇతర టీడీపీ నేతలు ఒక్కసారిగా గోదావరిలో పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు.
అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణం: మంత్రి కన్నబాబు