telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది: కేటీఆర్

KTR Counter pawan comments
రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని ఆ పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎంపీ ఎన్నికల్లో నిలబెడుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగిందేమీ లేదని వాటి పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి సాధించలేదని ఆయన విమర్శించారు. 
బుధవారం  తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో గిరిజనులు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు.  కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలే నిర్ణయించే పరిస్థితి రావాలన్నారు. .దేశంలో మోదీ హవా తగ్గింది. ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలని పిలుపునిచ్చారు.

Related posts