telugu navyamedia
రాజకీయ

పాక్ ను ఇరుకున పెట్టిన భారత్.. ‘ఎఫ్-16’ పై వివరణ ఇవ్వాలని అమెరికా డిమాండ్!

Balakot, Pak Attack
పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయు సేన పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాక్ యుద్ధవిమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. అప్రమత్తంగా ఉన్న భారత వాయు సేనా పాక్‌ యుద్ధ విమానాలను వెంబడించి తరిమికొట్టాయి. అయితే ఈ దాడిలో అత్యాధునిక ఎఫ్-16 యుద్ద విమానాలను దాయాది దేశం వినియోగించింది. భారత్ పై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎందుకు వాడారో చెప్పాలని అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ ను డిమాండ్ చేసింది.
అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తయారుచేస్తున్నాయి. అయితే ఉగ్రవాదుల ఏరివేతతో పాటు ఆత్మరక్షణకు మాత్రమే ఎఫ్-16లను వాడుతామని హామీ ఇచ్చిన పాకిస్థాన్ వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేసింది. తాజాగా కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాలను పాక్ వాడింది. ఈ  వైమానిక దాడిలో  భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశాడు. దీంతో ఎఫ్-16తో పాటు అందులో వాడుతున్న అమ్రామ్ క్షిపణి శకలాలను భారత్ అమెరికాకు అందించి పాకిస్థాన్ ను ఇరుకున పెట్టింది. దీనిపై తొలుత బుకాయించిన పాక్ నేతలు.. భారత్ పూర్తి స్థాయి ఆధారాలు అందించడంతో అడ్డంగా దొరికిపోయి ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

Related posts