రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు (గెస్ట్ లెక్చరర్స్) హైకోర్టులో ఊరట లభించింది. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన వారినే ఈ ఏడాదీ కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ కళాశాలల్లో 1354 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం కొత్త వారిని నియమించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 34 మంది అతిథి అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఇప్పటి వరకు పనిచేస్తున్న వారినే కొనసాగించాలని.. కొత్త నియామక ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశించింది.