telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేరచరిత్ర కలిగిన వారు టీటీడీ బోర్డులో ఉన్నారు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల నియమించిన టీటీడీ బోర్డ్ పాలక మండలి పై ఆయన ఘాటుగా స్పందించారు. నేరచరిత్ర కలిగిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ఉన్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డిని సభ్యుడిగా నియమించడంపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తిరుపతిలో పచ్చ వజ్రం దాచేశారని గత ప్రభుత్వంపై అభాండాలు వేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని అన్నారు.

Related posts