తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీని కూడా పరోక్షంగా పరిపాలించాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు. ఏపీ పెన్షనర్ల సంఘం వార్షికోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోటీ చేయొద్దని ఏపీ అభ్యర్థులను ఆయన బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ బెదిరించి మన ఆస్తులు తీసుకున్నారని, ఏపీ బాగుపడితే తెలంగాణ కిందకి వెళ్తుందని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అథోగతిపాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో దౌర్జన్యాలు చేస్తున్నారని, తెలంగాణలో ఒకే పార్టీ ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కంటే మెరుగైన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్, మోదీ, జగన్తో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.