telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాహుల్ ని కూడా .. కశ్మీర్ రావడానికి అనుమతించం …

rahul grand victory in kerala with 4laks more votes

జమ్ము, కశ్మీర్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌లు శ్రీనగర్‌ను సందర్శించనున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ శ్రీనగర్ రావొద్దంటూ ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ ద్వారా కోరింది. వారు శ్రీనగర్ రావడం వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. సీనియర్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. శాంతిభద్రతలకు, ప్రజల ప్రాణాలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది.

ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీ పెద్దలు తప్పుడు నిర్ణయాలు తీసుకోని ఆ వాతావరణాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఇక్కడికొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించింది.

Related posts