ప్రతిపక్ష పార్టీల నేతలు శ్రీనగర్ కు రావద్దని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్లు నేడు శ్రీనగర్ను సందర్శించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారు శ్రీనగర్ రావడం వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిపింది. సీనియర్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అధికారిక ట్విట్టర్ ద్వారా కోరింది.శాంతిభద్రతలకు, ప్రజల ప్రాణాలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది.
కశ్మీర్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికొచ్చి ఆ వాతావరణాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వం కోరింది. ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేతలు శ్రీనగర్ కు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అభ్యర్థించింది.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ