బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ గ్యాస్ పైప్లైన్ పేలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. నారాయణగంజ్లోని బైతుస్ సలాత్ జామే మసీదు వద్ద ఉన్న గ్యాస్ పైప్లైన్ శుక్రవారం రాత్రి పేలినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి మసీదులోని ఆరు ఏసీలు కూడా పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 37 మంది ముస్లింలు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో చికిత్స పొందుతూ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగా పేలుళ్లు సంభవించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.