telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ .. టీడీపీలోకి.. నేటి సాయంత్రమే !!

JD Laxminarayana filed nomination janasena

ఎప్పటి నుండో రాజకీయాలలోకి వస్తాను అని చెప్పుకుంటూ వస్తున్న మాజీ సిబిఐ జేడీ లక్ష్మినారాయణ మొత్తానికి ఒక నిర్ణయం నేడు ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు ఆయన ఆ పార్టీలో చేరుతాడు, ఈ పార్టీలో చేరుతాడు అంటూ.. వస్తున్నా వార్తలకు చెక్ పెడుతూ తానే ఒక పార్టీని పెడతాను అన్న ఆయన నిర్ణయం మార్చుకున్నట్టుగానే ఉంది.

తాజా సమాచారం ప్రకారం లక్ష్మీనారాయణ ప్రారంభంలో అందరూ అనుకున్నట్టుగానే టీడీపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలియవస్తుంది. నేడు సాయంత్రమే దానికి మూహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఏపీసీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇక మిగిలింది ఏ నియోజక వర్గం నుండి పోటీ చేయనున్నారు అనేది మాత్రమే. అసలైతే అది ముందే ఖాయం చేసుకున్నాకే, ఈ చేరిక కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది.

భీమిలి అవంతి శ్రీనివాస్ ఇటీవల టీడీపీ కి బై చెప్పటంతో.. ఆయన పై పోటీగా లక్ష్మీనారాయణను టీడీపీ తరుపున నిలబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అంతటా పర్యటించిన లక్ష్మీనారాయణకు భీమిలిలో గెలుపు నల్లేరుపై నడకగా సాగుతుందని ఏపీసీఎం కూడా భావించి, ఆ స్థానం నిర్ణయించినట్టు సమాచారం. ఏదిఏమైనా రాజకీయాలలోకి వస్తాను అన్న లక్ష్మీనారాయణ, టీడీపీ ద్వారా ప్రజాసేవ చేయాలనీ నిర్ణయించుకోవడం విశేషం.

Related posts