telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైద్రాబాద్ లో కానిస్టేబుల్‌కు కరోనా

Corona

తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ఒక్కొక్కరుగా కరోనా రోగులుగా మారుతుండడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో బాధిత కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. ఆయనతో పనిచేసిన వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. తోటి సిబ్బందిని హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. పోలీస్ శాఖలో పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చాలామంది పోలీసులు లాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

Related posts