telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.34 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇది ఇలా ఉండగా..  తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం యోగి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే తాను కోలుకుని.. ప్రజల ముందుకు వస్తానని సీఎం యోగి పేర్కొన్నారు. ఇక అటు ఇప్పటికే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పటికే కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

Related posts