వచ్చిన మొదట్లో హిట్స్ తో ఓ వెలుగు వెలిగిన శృతి హాసన్ కొన్నాళ్లపాటు సినీ ప్రపంచానికి దూరమయ్యి, ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మైఖేల్ కోర్సలే ప్రేయాణం కారణంగా నాలుగేళ్లు ప్రేక్షకులకు దూరమయింది. అయితే ఇప్పడు మళ్లీ తన నటనీ జీవితాన్ని ముందుకు నడిపించనుంది. అందుకుగానూ మాస్ మహరాజ్ రవితేజ సరసన క్రాక్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తన రీఎంట్రీలోనూ తనదైన స్టైల్ను మెయిన్టెన్ చేసింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఆఫర్లు వరుసగా ఆమె తలుపు తట్టాయి. పారితోషికం విషయంలో ఏమాత్రం రాజీ పడనని ఆమె తేల్చి చెప్పేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి కొన్ని విషయాలపై స్పందించింది. టాలీవుడ్లో తమన్నా చాలా సెక్సీగా ఉంటుందని చెప్పింది. తరువాత పారితోషికంతో పనిలేకుండా పనిచేయాలంటే ఏ హీరోతో చేస్తావని అడిగిన ప్రశ్నకు టక్కున ప్రభాస్ అని చెప్పింది. ప్రభాస్తో చాన్స్ వస్తే పారితోషికం ఎంత తక్కువైనా ఓకే చెప్పేస్తానని, అంతేకాని ప్రభాస్తో చేసే అవకాశాన్ని వదులుకోనని తెలిపింది.చూడాలి మరి ఈ కాంబినేషలో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది.
previous post
next post
ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ: మాజీ మంత్రి ఆలపాటి