తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అటు రాజధాని హైదరాబాద్ లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా విలయం కొనసాగుతున్న నేపద్యంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కీలక సూచనలు చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త ఉండాలని.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని తెలిపారు. మాస్కులు ధరించని వారిపై ఈ చాలన్ ద్వారా కేసు నమోదు చేసి 1000 జరిమానా విధిస్తున్నామనీ హెచ్చరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తామని.. నిన్న మాస్క్ దరించని 832 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. రాచకొండ పోలీసులు కూడా కరోనా వైరస్ పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారని వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారని… పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు, వందల మంది కంటే ఎక్కువగా గ్యాదర్ కాకూడదని పేర్కొన్నారు. అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని కోరారు. ఆస్పత్రులల్లో బెడ్స్ కొరత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
previous post
next post