ఢిల్లీ : దేశ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా వేగంగానే పావులు కదుపుతోంది. అంతేకాకుండా తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది.
తెలంగాణ ముఖ్యనేతలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సారధ్యంలో వార్రూంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, వి. హన్మంతరావు, దామోదర రాజనర్సింహా, షబ్బీర్లీ, పొన్నం ప్రభాకర్, బోసురాజు, శ్రీనివాసన్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, సీతక్క, ఉత్తమ్కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ భేటీలో తెలంగాణలో తాజాగా మారుతున్న పరిణామాలు, హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు