వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఘటనపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం నేడు జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దోషులకు త్వరితగతిన శిక్ష పడేందుకు కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ సీఈఓ, పారిజాతం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.