telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: మంత్రి సత్యవతి

sathyavathi rathod

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య ఘటనపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సమావేశం నేడు జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దోషులకు త్వరితగతిన శిక్ష పడేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ సీఈఓ, పారిజాతం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts