ఈ ఎన్నికల్లో బీజేపీ కి, కాంగ్రెస్కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ .. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని అని అన్నారు.
17 మంది టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటేనే.. తెలంగాణ హక్కుల్ని సాధించుకోవచ్చునని కవిత వ్యాఖ్యానించారు. ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులే: సిద్ధరామయ్య