telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిహార్‌ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్‌ కుమార్‌..

బిహార్‌ ముఖ్యమంత్రి పదవిని నితీశ్‌ కుమార్‌ మరోసారి చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు నితీశ్‌ కుమార్‌ ఆరు సార్లు సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 74 స్థానాలు దక్కించుకున్న బీజేపీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. ఎన్నికల ప్రక్రియకు ముందే నితీశ్‌కుమార్‌ను ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధాని మోడీ ప్రకటించారు. ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా… మిత్ర ధర్మాన్ని అనుసరించి నితీశ్‌కుమార్‌కు సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకుంది.  కాగా… జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్‌ కుమార్‌నే సీఎంగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. 

Related posts