telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రఘునందన్‌రావు ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్!

Raghunandan

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అయితే.. ఎమ్మెల్యేగా రఘనందన్‌రావు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు స్పీకర్‌ ఛాంబర్‌లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘనందన్‌రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.. ముందుగా సర్వేలు చెప్పినట్టుగానే బీజేపీ దుబ్బాకలో ఘన విజయం సాధించింది. దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి 21, 819 ఓట్లు వచ్చాయి. అటు ఓట్ల శాతంగా ఇరు పార్టీలకు వచ్చినవి చూసుకుంటే.. బీజేపీ పార్టీకి 39 శాతం రాగా.. టీఆర్‌ఎస్‌ పార్టీకి 37 శాతం ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇక దుబ్బాక కౌంటర్‌ టీ-20 మ్యాచ్‌ను తలపించిన విషయం తెలిసిందే.

Related posts