telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పెళ్ళి పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

marriage

గుంటూరులో పెళ్ళి పేరుతో ఓ యువతి మోసానికి పాల్పడింది. అమెరికాలో ఉంటున్న తెనాలి యువకుడికి గాలం వేసింది ఆ మహిళ. నెల రోజులుగా అబ్బాయిని మాటలతో ముగ్గులోకి దించిన యువతి…మ్యాట్రీమోనిలో మైనేని సముద్రగా పరిచయం చేసుకుంది ఆ యువతి. తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. ఈ నెల 21 న పెళ్లి చూపులు, 24న పసుపు కుంకుమ పెట్టుకుందామని నమ్మించిన యువతి…ఈ.లోగా నగలు, చీరలు కొనుగోలుకు 7.20 లక్షలు అకౌంట్ లో వేయించుకుంది యువతి. నిన్న పెళ్లి చూపులకు ప్రకాశం జిల్లా ఉలవపాడు అబ్బాయి కుటుంబం వెళ్లి యువతికి కాల్ చేసారు. ఉదయం నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసిన యువతి…ఎవరికీ చెప్పకుండా తప్పించుకుంది. గ్రామం మొత్తం వాకాబు చేసి మోసపోయామని గ్రహించిన అబ్బాయి కుటుంబం…యువతి మోసంపై పోలీసులను బాధిత కుటుంబం ఆశ్రయించింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు..ఆ యువతిని పట్టుకునే పనిలో పడ్డారు.

Related posts