ఏపీ రాజకీయాల్లో మరో అంశం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో రహస్యంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపుతోంది. ఊహించినట్టుగానే వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం అని పేర్కొంటూ, దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫేస్ టైమ్ లో మాట్లాడిన నాలుగో బాస్ ఎవరని ప్రశ్నించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వస్తాయని చెప్పారు.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స