telugu navyamedia
రాజకీయ వార్తలు

పాదయాత్ర చేస్తున్న .. ప్రియాంకా గాంధీ.. 180కిమీ.. 10రోజులు..

priyanka gandhi padayatra in UP

కాంగ్రెస్ అధిష్ఠానం యూపీలో పది రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళల రక్షణ, చిన్మయానంద రేప్ కేసును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పాదయాత్రను పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. షాజహాన్ పూర్ నుంచి లక్నో వరకు దాదాపు 180 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో చిన్మయానంద రేప్ కేసునే ప్రజల్లోకి తీసుకెళ్లి యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మహిళల రక్షణ సహా రైతులు, నిరుద్యోగుల అంశాలను కూడా ఆ పార్టీ లేవనెత్తనుంది. ఈ పాదయాత్రలో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. ప్రతీ రోజూ దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగాలని నేతలు నిశ్చయించుకున్నారు. ఇప్పటికే ఓ బృందం షాజహాన్ పూర్ చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పాదయాత్ర సవ్యంగా సాగేట్లు రాష్ట్ర నేతలు వ్యూహం రచిస్తున్నారు.

Related posts