telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు

bjp party

తిరుమల ఆలయంపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్ శ్రీవారి దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకు వైసీపీ కేర్ఆఫ్ అడ్రస్ అయిందన్నారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో సీఎం జగన్ పరిశీలించాలన్నారు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి గుడిని నీయమ్మ మొగుడు కట్టించాడా అంటూ మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని తెలియదా? అని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వాలని చట్టంలో ఉందని, తెలిసి కూడా అహంకార దోరణితో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

Related posts