telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ దుష్ప్రచారంపై పవన్ కల్యాణ్ ఫైర్

pawan-kalyan

జనసేన ఎకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇంగ్లీషు మీడియం కావాల్సిందేనని మద్దతు అసెంబ్లీలో పలకడంతో పార్టీ నుంచి ఆయఙ్కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయన్న వార్త దావనంలో వ్యాపించింది. రాపాకపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఇది వైసీపీ మద్దతుదారుల దుష్ప్రచారం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.

నిన్న తాను రైతు సౌభాగ్య దీక్షలో ఉన్నానని, కానీ రాపాక గారికి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయని వైసీపీతో సంబంధం ఉందన్న వెబ్ సైట్ లోనే మొదటగా పబ్లిష్ అయిందని తెలిపారు. ఈ వెబ్ సైట్ లో వార్త రావడం వెనుక ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు వైసీపీ మద్దతుదారులపై పవన్ మండిపడ్డారు. రాపాక గారికి క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయాన్ని ఖండించాలని పవన్ పేర్కొన్నారు.

Related posts