telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్ పెట్రోల్….

కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.25కే లీటర్ పెట్రోల్ ఇచ్చే వాళ్లం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే మూడేళ్లు ఉంటే అసెంబ్లీలో ఉంటా.. లేదంటే జనంలోనే ఉంటానన్న భట్టి.. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా దుర్మార్గపు ఆలోచనతోనే వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు. అయితే పెట్రోల్ ధరలు ఇప్పటికే సెంచరీ దాటేశాయి.. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే.. రూ.25కే లీటర్ పెట్రోల్ వచ్చేలా చేసిది అని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో 120 డాలర్లకు పైగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75 లోపే లీటర్ అందించింది.. ఇప్పుడు క్రూడ్ అయిల్ ధర 70 డాలర్ల లోపు ఉన్నా.. భారీగా పెట్రోల్ ధరలు ఉండడంతో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తాజాగా పార్టీని వీడిన కూన శ్రీశైలం గౌడ్ కామెంట్లపై స్పందించిన భట్టి… పార్టీ పనిచేయడం లేదంటే.. డీసీసీ అధ్యక్షుడిగా కూడా కూన శ్రీశైలం పని చేయనట్టేగా? అని ప్రశ్నించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేనోడు మాత్రమే బయటకు పోతాడని కామెంట్ చేశారు. మరోవైపు.. అయోధ్య గురించే కాదు.. ప్రతీ ఊర్లో ఉన్న రాముడు గురించి కూడా మాట్లాడాలని.. అందరి రాముడ్ని.. మా ఒక్కడి రాముడే అనడం దుర్మార్గం అని మండిపడ్డారు. చూడాలి మరి దీని పై వారు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts