ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల పలు సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో శాసనమండలిలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా? అని ఇవాళ శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
రాజధాని అమరావతిని మార్చడం లేదని ప్రకటించారు. అమరావతి కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల వివరాల గురించి టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, రాజధాని మార్పు అంశంపై ఇన్నాళ్లూ ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. మంత్రి బొత్స సమాధానంతో రాజధానిగా అమరావతి ఉంటుదని స్పష్టమైంది.
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…