telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అగ్రిగోల్డ్ కేసు : విచారణకు హైదరాబాద్ హైకోర్టు అంగీకారం..

high court on new building in telangana

అగ్రిగోల్డ్ కేసు విచారణకు హైదరాబాద్ హైకోర్టు అంగీకరించింది. అగ్రిగోల్డ్ కేసు విచారణ కోసం జస్టిస్ ఎస్ రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ముందు ఆంధ్ర ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ లను హైకోర్టు మెన్షన్ చేసింది. సోమవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది హైదరాబాద్ హైకోర్టు. అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తిరిగి చెల్లించేందుకు అనుమతించాలని దాఖలు చేసిన అప్లికేషన్ విచారించాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీ రాం కోరారు. దీంతో ఈ కేసు విచారణకు హైదరాబాద్ న్యాయస్థానం అంగీకరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణ, హైకోర్టు ఆదీనంలో ఉన్న నిధులు పంపిణీ చెయ్యాలని కోరుతూ దాఖలు చేసిన అప్లికేషన్ విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు. సోమవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది హైదరాబాద్ హైకోర్టు. అగ్రిగోల్డ్ కేసు విచారణకు హైదరాబాద్ హైకోర్టు అంగీకరించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Related posts