telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రపంచంలోనే మానవత్వం లేని ముఖ్యమంత్రి కేసీఆర్…

తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటి లెటర్ లు లేవని అనేక పోన్స్ వస్తున్నాయి బంగారు తెలంగాణ శవాల తెలంగాణ గా మారింది. గుట్టలు గుట్టలు గా శవాలు ఉన్నాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బాధ,భయం తో యువకులు చనిపోతున్నారు. కోవిడ్ నియంత్రణకి ఏ జిల్లాకు నిధులు కేటాయించలేదు. పేదలు చనిపోతున్న కాపాడే ప్రయత్నం సీఎం చేయడం లేదు అన్నారు. చాలా హాస్పిటల్స్ కోవిడ్ పేషెంట్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న… ప్రభుత్వం సహకారం లేదు. కేసీఆర్ పని సీఎం కుర్చీ కాపాడుకోవాలి.. ఆ కుర్చీని కొడుక్కి ఇవ్వాలి అని పేర్కొన్నారు.  ఓ మంత్రి భూమి కోసం నలుగురు ias ల అధికారులతో కమిటీ వేశారు. అదే శ్రద్ధ కోవిడ్ విషయం లో ఎందుకు పెట్టడం లేదు. ప్రపంచంలోనే మానవత్వం లేని ముఖ్యమంత్రి కేసీఆర్..అన్ని అబద్ధాలే .. ఎవరు నమ్మడం లేదు అని అన్నారు.

Related posts