telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డీజీపీ లేఖ రాయడం హాస్యాస్పదం: చంద్రబాబు

chandrababu tdp ap

సీల్డ్ కవర్ లో సాక్ష్యాధారాలు పంపాలని డీజీపీ నాకు లేఖ రాయడం హాస్యాస్పదమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట అని తెలిపారు. విచారణ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా? అని  ప్రశ్నించారు.

వైసీపీ నాయకులు, సీఎం బంధువులపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నారని చెప్పారు. ఏ నేరం చేయకపోయినా టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. బాధితులకు పోలీసులు అండగా ఉండాలి కానీ, నేరగాళ్లకు వత్తాసు పలకరాదని హితవు పలికారు.

చిత్తూరు జిల్లాలో రామచంద్రపై దాడి ఘటనకు రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ, డీఎస్పీ మొదట చెప్పారని, ఆ తర్వాత కుమార్ రెడ్డి పేరుకు బదులు ప్రతాప్ రెడ్డి పేరు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ దారుణాలు జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయ్యాయని విమర్శించారు. దేవాలయాలపై ఇప్పటికీ దాడులు ఆగడం లేదని దుయ్యబట్టారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత వెల్లువిరుస్తున్న వైసీపీ బుద్ధులు మారడం లేదని అన్నారు.

Related posts