ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ జిల్లాలో మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఆ జిల్లాలో 100 ప్రత్యేక బృందాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ జిల్లాలో పర్యటించి, వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.
ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్లో 48 గంటలపాటు ఉన్నారు. వారు పర్యటించిన కరీంనగర్ కలెక్టరేట్కు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు ప్రత్యేక బృందాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆ ప్రాంతాల ప్రజలు వైద్యులకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్రెడ్డి