telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అందుకు నిదర్శనమే ఈ ఫలితాలు : పొన్నం

ponnam prabhakar fire on ktr

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి అనుకున్న దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అని అన్నారు. బీజేపీ నాయకత్వం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుండి మొదలుకొని యోగి ఆదిత్యనాథ్ వరకు మరియు మహారాష్ట్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, స్మృతి ఇరానీ వంటి నాయకులను దించి హైదరాబాద్ మొత్తం గల్లి గల్లి తిరిగారు. 90 పైగా సీట్లు వస్తే గెలిచినట్టు కానీ కొన్ని స్థానాలకే పరిమితమైనప్పటికీ బీజేపీ వాళ్ళు పండుగ జరుపుకుంటున్నారు. కానీ బీజేపీ నాయకులు ఇది గమనించాలి ప్రజలు మిమ్మల్ని కూడా తిరస్కరించారని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కరోనా పరిస్థితులలో మరియు వరదలు వంటి విపత్కర పరిస్థితులలో హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేశారనే కోపం ప్రజలలో ఉంది. టీఆర్ఎస్ పార్టీపై దుబ్బాక నుండి ప్రారంభమైన వ్యతిరేకత హైదరాబాద్ నగరం వరకు వచ్చింది అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతొ ప్రజలు ఆశీర్వదించకపోవచ్చు. కానీ భవిష్యత్ కాలంలో పార్టీని పునర్నిర్మాణం చేసుకొని ముందుకు సాగుతాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇస్తున్నాం. 2009 సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులే లేని టీఆర్ఎస్ పార్టీ , మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు రాని బీజేపీ పార్టీ ఈ రోజు ఏదో గొప్పగా గెలిచాయి అని అనుకోవద్దు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద రకరకాల వ్యాఖ్యలు చేసిన పార్టీకి మరియు అధికార అహంతొ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినారు అని గమనించాలి అంటూ పొన్నం చెప్పుకొచ్చారు.

Related posts