విజయవాడ పచ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓ వీడియో జర్నలిస్ట్ పై రెచ్చిపోయారు. ఏపీలోని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద వార్త చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై దౌర్జన్యం చేయడమే కాకుండా కెమెరా లాక్కున్నారు. తన కోడలితో వివాదం జరుగుతుండటంతో జలీల్ ఖాన్ గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే తనకు న్యాయం జరపడంలేదని కోడలు మెహమూదా సీపీని ఆశ్రయించారు.
దీనిపై సీపీ ఆదేశాల ప్రకారం డీసీపీ రాజకుమారి ఇరువర్గాలను పిలిపించారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయానికి వస్తుండగా జలీల్ ఖాన్ను జర్నలిస్ట్ కెమెరాలో చిత్రీకరించారు. దీంతో జలీల్ఖాన్ బూతులతో దుర్బాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ఎమ్మెల్యేను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ఏడీసీపీ నవాబ్ జాన్ స్వయంగా కెమెరాలో చిత్రీకరించిన విజువల్స్ను డిలీట్ చేశారు. విషయం తెల్సుకున్న జర్నలిస్ట్ సంఘాలు సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.