telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్: పవన్ కల్యాణ్

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు వచ్చిన జనసేన పార్టీని అందరూ ఆదరించాలని పవన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్టు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులందరికీ మోడల్ హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ రిఫామ్స్ కమిషన్ ఏర్పాటు చేసి టీచరు, విద్యార్థుల కోసమే పని చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీచర్స్ కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి తప్ప ఏ పార్టీల నాయకుల కోసం పనిచేయకూడదని కఠిన నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రచారంలో పవన్ కల్యాణ్ తో కలిసి ప్రముఖ హీరో అల్లు అర్జున్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts