telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ కన్నుమూత

Raaiv Ravindranath

తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. సోమవారం రాత్రి ఆయన మృతి చెందారు. భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి తెనాలికి తరలించనున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి రావి రవీంద్రనాథ్ చౌదరి అత్యంత సన్నిహితుడు. వైఎస్ తో కలిసి ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి తెనాలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ గానూ రెండు సార్లు ఎన్నికయ్యారు. రవీంద్రనాథ్ చౌదరి మృతితో స్వగ్రామమైన తెనాలిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కార్యకర్తలు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Related posts