telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్స్‌‌.. కొత్తగా 1,115 కేసులు నమోదు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,857 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,265 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,85,566 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,693యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,66,29,314 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో వేగంగా వ్యాక్సిన్‌ను అమ‌లు చేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ అమ‌లు చేస్తున్నా కేసులు పెరుగుతుండ‌డంతో త‌ప్ప‌ని స‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, చిత్తూరులో 210, గుంటూరులో 121, కృష్ణాలో 165, నెల్లూరులో 120, ప్ర‌కాశంలో 121, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 125 కేసులు న‌మోద‌య్యాయి.

Related posts