telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మండలిలో ‘సేమ్ సీన్ రిపీట్’:యనమల

Yanamala tdp

 బడ్జెట్ సమావేశాలు నిర్వహించేముందు రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ విధంగా అయితే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారో, అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేస్తుంటారని అన్నారు.

శాసనమండలి వ్యతిరేకించిన రెండు బిల్లుల గురించిన ప్రస్తావన నిబంధనల ప్రకారం ఈ ప్రసంగంలో ఉండడానికి వీల్లేదని, అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వం పంపే ప్రసంగ కాపీని గవర్నర్ పరిశీలించాలని కోరారు. ఒకవేళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాల గురించిన ప్రస్తావన ఉంటే కనుక సవరణలను ప్రతిపాదించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కనుక మొండిగా వ్యవహరిస్తే మండలిలో ‘సేమ్ సీన్ రిపీట్’ అవుతుందని అన్నారు.

Related posts